టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రత తగ్గింపును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. జెడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న చంద్రబాబుకు మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్లనుంచి ముప్పు పొంచి ఉందని న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం, శ్రీరాం వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని అన్నారు. 58 మంది భద్రత కల్పించాల్సి ఉంటే.. 74 మందితో భద్రత కల్పించామని కోర్టుకు తెలిపారు. దీంతో సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది.
తెలంగాణకు రాబడి తక్కువ… అప్పులు ఎక్కువ: భట్టి విక్రమార్క