telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు పర్యటనకు కలెక్టర్లు గైర్హాజర్

chandrababu fire on AP CS again

ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలకు అధికారులు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయా శాఖల అధికారులు సమీక్ష సమావేశాలకు హాజరు కావడం లేదు. తాజాగా ఈరోజు పోలవరం ప్రాజెట్ పనులను చంద్రబాబు సందర్శించిన సంగతి తెలిసిందే. అయితే బాబు పర్యటనకు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ దూరంగా ఉన్నారు.

సోమవారం సాయంత్రం చంద్రబాబు పోలవరం పర్యటన ముగిసింది. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులు, గేట్ల బిగింపు మొయిన్ డ్యామ్ పనులను ఆయన పరిశీలించారు. చంద్రబాబు పర్యటనలో పరిమిత సంఖ్యలోనే అధికారులు హాజరయ్యారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ శ్రీధర్ మాత్రమే హాజరయ్యారు.

Related posts