telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

టీడీపీ కార్యకర్తలపై దాడులు..ప్రజలలోనే ఎండగట్టాలి.. : చంద్రబాబు

chandrababu gift on may day

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ దాడులను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ఏపీ టీడీఎల్పీ సమావేశంలో తమ పార్టీ నాయకులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. వైసీపీ దాడులను నిరసిస్తూ ఎక్కడికక్కడ సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని, తప్పుడు కేసులు బనాయిస్తారని, ఇలాంటి వన్నీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

తమ నాయకులను భయపెట్టడం, దాడులకు పాల్పడటం వంటివి చేస్తుంటే చూస్తూ మౌనంగా ఉండలేమని చంద్రబాబు చెప్పారు. తమ పార్టీపై, నాయకులపై అవినీతి బురద చల్లే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని, జీవోలను విశ్లేషించాలని, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మనం చేసే విమర్శలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని నాయకులతో చంద్రబాబు చెప్పినట్టు సూచించారు.

Related posts