టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట ఎందుకు ప్రచారం చేయలేదో ఇప్పుడు వివరించారు. పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించాం. దాని వల్ల నష్టపోయాం.. రాష్ట్రానికి లాభం జరగలేదు.. పార్టీకి నష్టం జరిగింది.. అది పెట్టుకోకుండా ఉంటే ఇంకో విధంగా ఉండేదంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రయోజనం పొందిన ప్రజలు సైతం తనకు సహకరించలేదని వాపోయారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా మరో సారి రాజకీయంగా ఏపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది..
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించామని చెబుతూనే… దానివల్ల రాష్ట్రానికి లాభం జరగలేదు.. పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అది పెట్టుకోకుండా ఉంటే ఇంకో విధంగా ఉండేదన్నారు.. ఆ చాప్టర్ ఈజ్ ఓవర్ అంటూనే భవిష్యత్లో ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలి. ..అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్నికల సమయం నుండి మనసులో ఉన్న విషయాలను ..అంతర్మధనాన్ని ఇప్పుడు విశాఖలో బయట పెట్టినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈసీ పనిచేస్తోంది: ఎంపీ కనకమేడల