telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అత్యుత్తమ మేధావులతో కలిసి పనిచేస్తున్నాం: చంద్రబాబు

chandrababu

కరోనా చర్యల్లో భాగంగా తాము ప్రతిపాదించిన హాట్ స్పాట్ నమూనాల పట్ల నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కూడా ప్రశంసించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రపంచ అత్యుత్తమ మేధావులతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కొవిడ్-19పై దేశం సాగిస్తున్న పోరాటానికి తాము ఈ విధంగా సహకారం అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ పాటిస్తున్న విధానాలను జీఎఫ్ఎస్ టీ కూడా అనుసరిస్తుండడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. కొవిడ్-19 చర్యల్లో భాగంగా విలువైన సూచనలు అందజేశారంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చంద్రబాబుకు లేఖ రాయడంవిధితమే.

Related posts