పోలవరం ప్రాజక్టు నుంచి విరమించుకోవాలంటూ ఏపీ సర్కారు నవయుగ ఇంజినీరింగ్ సంస్థకు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో పోలవరం ప్రాజక్టుకు వరద పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. వరద సమయంలో ప్రాజక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలను వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం నోటీసులు పంపడం సరికాదని హితవు పలికారు. నవయుగ సంస్థ ఇప్పటికే బందరు పోర్టు నిర్మాణ భాగస్వామ్యం నుంచి కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది.ప్రాజక్టు పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థమవుతోందని ట్విట్టర్ విమర్శించారు.