టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటి అయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జమిలి ఎన్నికలపై జరగనున్న సమావేశానికి పార్టీ తరుపున లేఖ రాయాలని బాబు నిర్ణయించారు. జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అందరి అభిప్రాయాలు తీసుకోవాలని లేఖలో కొరనున్నారు.
న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో టీడీపీ కొరనున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయాలకు తావుండకూడదని, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని మోదీని చంద్రబాబు కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునేందుకుగాను తన నివాసంలో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు.