టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఇలాఖ కుప్పం పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అయితే ఆయనకు చుక్కెదురైంది. కుప్పంలో వైసీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు.కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.