telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు కుప్పం పర్యటన.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన ఇలాఖ కుప్పం పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అయితే ఆయనకు చుక్కెదురైంది. కుప్పంలో వైసీపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు.కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Related posts