telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రిటైర్డ్ ఉద్యోగులకు మొత్తం పింఛన్ ఇవ్వాలి: చంద్రబాబు

chandrababu

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల జీతాల్లో ఏపీ సర్కార్ కోత విధించింది. అధెవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయి పింఛన్ ఇవ్వకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. సుదీర్ఘకాలం ప్రభుత్వ సేవలందించిన వారిపై ఈ తరహా చర్యలు సబబు కాదని అన్నారు.

విశ్రాంత ఉద్యోగులకు పూర్తి స్థాయి పింఛన్ చెల్లించాలని అన్నారు. పింఛన్ అందుకునే వాళ్లందరూ 60 ఏళ్లకు పైబడిన వారేనని, ఈ వయసు వారికి ‘కరోనా’ వ్యాపించే అవకాశాలు అధికంగా ఇమ్మయన్నారు. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక వారికి పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related posts