telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు ఇంటివద్ద.. టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ

ycp letter to CS on praja vedika building

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టడంపై ఈరోజు టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రమమలో వరద పరిస్థితిపై అంచనా కోసం తామే విజువల్స్ తీయాల్సిందిగా ఆదేశించామని ఏపీ జలవనరుల శాఖ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్దకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకోగా, పోటీగా అక్కడకు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ-వైసీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతిమించడంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ గొడవ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, వర్ల రామయ్య, ఆలపాటి రాజా, మద్దాల గిరి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దీంతో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Related posts