టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కుటుంబంతో విదేశీ యాత్రకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న విదేశాలకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న దశలో కొన్ని అనివార్య కారణాలతో విదేశీ యాత్ర రద్దయింది.
త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు, కేశినేని నాని అంశం పార్టీలో విభేదాలను తేటతెల్లం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విహారయాత్రకు వెళ్లడం సబబుకాదని చంద్రబాబు భావించినట్టు సమాచారం.
ప్రజావేదికను కూల్చివేయాలి.. అధికారులకు జగన్ ఆదేశాలు