telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“ఇదేనా రాజన్న రాజ్యం” అని ప్రశ్నిస్తే కేసు పెడతారా?: చంద్రబాబు ఫైర్

chandrababu

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురిచేయడం పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. ఒక్క టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైనే వేధింపులా? అని ప్రశ్నించారు. ఇదేనా రాజన్న రాజ్యం?’ అని ప్రశ్నిస్తే కేసు పెడతారా? అంటూ ఓ ట్వీట్ లో చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ వాళ్లను బెదిరించే వైసీపీ వాళ్లపై చర్యలు ఉండవా? చట్టం వైసీపీకి గత 100 రోజుల్లో చుట్టం అయిందా? ‘151మేకలు, 23 పులులు’ అని పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా? అని ట్విటర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts