టీడీపీ అధినేత ఏపీ సీఏం చంద్రబాబు మరోసారి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై మండిపడ్డారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తుని ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆనాడు తునిలో రైలును తగలబెట్టించిన ఘనుడు జగన్ అని ఆరోపించారు. రౌడీలను తీసుకువచ్చి తునిలో ఘాతుకానికి పాల్పడ్డాడనిచెప్పారు. దేశంలో ఎన్ని కేసులున్నాయో అన్ని కేసులు జగన్ పై ఉన్నాయని ఎద్దేవా చేశారు.
తనమీద కూడా ఒక కేసు ఉందని, మహారాష్ట్రలో రైతుల కోసం వెళితే దొంగ కేసు నమోదుచేశారని చంద్రబాబు వెల్లడించారు. జగన్ వంటి నేరస్తుడితో పోటీ అంటే నాకే సిగ్గుగా ఉందని చెప్పుకొచ్చారు. గతంలో తాను ఎంతోమందితో పోరాడానని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి హేమాహేమీలతో ఢీకొట్టానని గుర్తు చేశారు. కానీ 31 కేసులున్న జగన్ తో ఇప్పుడు పోరాడాల్సివస్తోందని అన్నారు.
వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీ.. పెరుగుతున్న మాటల యుద్దం!