సీఎం జగన్పై మాజీ టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ఇంతటి రాక్షస పాలన చరిత్రలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినవారు కూడా ఇలా ప్రవర్తించలేదనిఅన్నారు.ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో రౌడీలను తయారు చూస్తున్నారని ఆరోపించారు. వైఎస్ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను కడపకే పరిమితం చేసేవారని తెలిపారు. ఒకవేళ కడప జిల్లా దాటి వస్తే వైఎస్ పెద్దమనిషిలానే రాజకీయాలు చేసేవారని చెప్పారు.
కానీ జగన్ మాత్రం కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు. పులివెందుల పంచాయితీ రాష్ట్రమంతా రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో కడప రౌడీయిజానికి నిరసనగానే విశాఖ ప్రజలు వైఎస్.విజయలక్ష్మిని ఓడించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం విధ్వంసం నడుస్తోందన్నారు. ఆఖరుకు తనను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్నారు. తన పర్యటనలకు భద్రత తగ్గించి ఇబ్బందిపెడుతున్నారని పేర్కొన్నారు.
మాయమాటలతో కేసీఆర్ ఐదేళ్లు పాలన: ఎంపీ కోమటిరెడ్డి