telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కేసీఆర్‌ కుటుంబానికి ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషం: చంద్రబాబు

Chandrababu fire to CM KCR
తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి ఆంధ్రాపై నిలువెల్లా ద్వేషమని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రాపై విద్వేషానికి టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలే రుజువన్నారు. తెలుగుతల్లిని అవమానించిన కేసీఆర్‌తో జగన్ దోస్తీ చేశారని విమర్శించారు. ముందు కేసీఆర్ పెట్టుబడి పెడతారు, తర్వాత జగన్ కప్పం కడతారని ఆరోపించారు. వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలను ప్రజలకు చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆరేనని, వైసీపీ, టీఆర్ఎస్ కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేనని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని టీఆర్ఎస్‌కు డమ్మీగా చేశారని ఎద్దేవాచేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఓ‌ట్ల తొలగింపు కుట్ర చేధిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ దొంగ పనులు చేస్తుందని,  టీఆర్ఎస్ కు భారీగా డబ్బులు అందాయని చంద్రబాబు ఆరోపించారు.

Related posts