telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీని మింగేందుకు వస్తున్న గద్దలకు బుద్ధి చెప్పాలి: చంద్రబాబు

Chandrababu comments Jagan cases

ఏపీని మింగేసేందుకు వస్తున్న గద్దలకు బుద్ధిచెప్పాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు. గురువారం ఎలక్షన్ మిషన్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ అవినీతి వల్ల వాన్‌పిక్‌కు, లేపాక్షికి వేల ఎకరాలు కట్టబెట్టారని ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల ఎకరాలు నిరూపయోగంగా మారాయని విమర్శించారు. జగన్ సమాజానికే పెనుప్రమాదంగా మారారని అన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై డ్రామాల మీద డ్రామాలు నడుస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ డేటా చోరీకి భారీ కుట్ర జరిగిందన్నారు.

జగన్ కుట్రలకు అంతు లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ పోలీసులు, వైద్యులపై నమ్మకం లేదన్న జగన్‌కు.. ఓట్లు మాత్రం కావాలా? అని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ రిటన్ గిఫ్ట్‌లు అంటున్నారని, తెలంగాణ మంత్రులను ఏపీ పైకి పంపి రెచ్చగొడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.టీడీపీ అభ్యర్ధులకు బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పేర్కొన్నారు.

Related posts