telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జగన్ పై కేసులు మాఫీ చేయడమే .. మోడీకి ప్రధాన ఎజండా.. : చంద్రబాబు

Chandrababu comments Jagan cases

సీఎం చంద్రబాబు మరోసారి మోడీపై విరుచుకు పడ్డారు. జగన్ కేసుల మాఫీయే మోదీ దృఢ సంకల్పమని బాబు ఎద్దేవా చేశారు. అందుకే జగన్ కంటికి మోదీ దృఢ చిత్తం కనిపిస్తోందని విమర్శించారు. అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ అడ్డుకునేందుకు దుష్ట ప్రయత్నాలు చేశారన్నారు. డమ్మీ ఈవీఎంలను కూడా నియోజకవర్గాల్లో దించారని తెలిపారు. ఓటర్లకు కూపన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు. మూడు పార్టీల లాలూచీకి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పారు.

పుట్టా సుధాకర్‌కు మొత్తం కడప మద్దతుగా నిలిచిందన్నారు. ఈ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం కనిపించాలన్నారు. ప్రత్యర్ధులకు వణుకు పుట్టించాలని సూచించారు. టీడీపీ బీసీ నేతలపై బీజేపీ నేతలు ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మొన్న బీదా మస్తాన్‌రావు, నిన్న పుట్టా సుధాకర్‌ ఇళ్లపై ఐటీ దాడులు చేశారన్నారు. వైసీపీ వ్యాపారులపై ఐటీ దాడులు చేయరా..?, టీఆర్ఎస్ కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు చేయించరా..? అని అడిగారు. టీడీపీ, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలనే బీజేపీ టార్గెట్ చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

Related posts