ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కాకినాడ రూరల్ ఏరియాలో నిర్వహించినా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట! వస్తాడేమో చూసుకుందామనుకున్నా. కానీ రాలేదు, పారిపోయాడు. కేసీఆర్, మోదీ, జగన్ లను చాపలో చుట్టి సముద్రంలో పారేస్తా..అంటూ ద్వజమెత్తారు. ప్రజలకు నీతివంతమైన పాలన అందించడం కోసం కష్టపడుతుంటే, జగన్ మాత్రం కేసీఆర్ వద్ద ఊడిగం చేసుకుని వెయ్యి కోట్లు తెచ్చుకుంటున్నాడని ఆరోపించారు.
తెలుగుతల్లిని అవమానించిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ట్యాంక్ బండ్ పై విగ్రహాలు కూల్చివేశారని, విగ్రహాలు ఏం తప్పుచేశాయని చంద్రబాబు ప్రశ్నించారు. నన్ను తిట్టినా పడతాను, కానీ మన ఆంధ్రుల్ని తిడితే మాత్రం సహించను అని మండిపడ్డారు. మనమంటే అంత లెక్కలేని తనమా! హైదరాబాద్ ను ఎవరు డెవలప్ చేశారు? సైబరాబాద్ ఎవరు డెవలప్ చేశారు? ఎయిర్ పోర్టు ఎవరు కట్టారు? అవుటర్ రింగ్ రోడ్డు ఎవరు తీసుకొచ్చారు? ఎవరి కోసం చేశాను? మనవాళ్ల కోసం చేశాను.
ఆంధ్ర ప్రదేశ్ అంటే అడవాళ్ల ప్రదేశ్ గా మారాలి: రోజా