telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బురద చల్లాలనుకున్న వైసీపీ ప్రభుత్వం అభాసుపాలు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షంపై విమర్శలకే సభా సమయాన్నంతా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పీపీఏలపై బురద చల్లాలనుకున్న వైసీపీ ప్రభుత్వం చివరకు అభాసుపాలయిందని చెప్పారు.అర్థంలేని ఆరోపణలతో సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. విచారణల పేరుతో కాలం గడిపేయాలని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

అవినీతి ఆరోపణలతో పోలవరం పనులను కూడా దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 66 శాతం పూర్తయ్యాయని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయని అన్నారు. కేంద్ర నుంచి నిధులను తెచ్చుకోవడం చేతకాక టీడీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైయస్ వల్ల కియా పరిశ్రమ ఏపీకి వచ్చిందని మంత్రి బుగ్గన చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

Related posts