ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తృణమూల్ కాంగ్రెస్ తరఫున పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభకు హాజరైన తెలుగు ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు తెలుగులో మాట్లాడారు. బెంగాల్ పురోగతిలో తెలుగువాళ్లు కూడా భాగం కావడాన్ని ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. బెంగాల్ టైగర్ లాంటి మమతా బెనర్జీ ముందు వందమంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. మమత బెనర్జీనీ ఇబ్బందులు పెట్టాలనుకునేవాళ్లే ఇబ్బందుల పాలవుతారని హెచ్చరించారు.
దేశంలో ఎక్కడాలేనంతగా తిరుగులేని ఆధిక్యంతో ఆమెను గెలిపించాలి. 42కి 42 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే గెలవాలి. ప్రతి ఒక్కరూ టీఎంసీకే ఓటెయ్యాలి. మమతా బెనర్జీ గారు ఏడేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఒకప్పుడు బెంగాల్ ఏంచేస్తే దేశం కూడా అదే చేసేదన్నారు. ఇవాళ బెంగాల్ లో వచ్చిన పథకం రేపు కేంద్రం ప్రభుత్వం అమలు చేసేది అని పేర్కొన్నారు.
బోస్టన్ గ్రూప్ కమిటీపై ఎఫ్బీఐ కేసులు: టీడీపీ నేత అనురాధ