telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నాలుగు నెలల్లోనే అమరావతిని ముంచేశారు: చంద్రబాబు

chandrababu

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్టణంలో పర్యటిస్తున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రాజధాని అమరావతిని ముంచేశారని అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల గత ఐదేళ్లలో రాని విద్యుత్ కోతలు ఇప్పుడు వచ్చాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు.

శ్మశానాలను కూడా వైసీపీ రంగులతో నింపేస్తున్న నాయకులు వారి ముఖాలకు కూడా ఆ రంగు వేసుకుంటే బావుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టీడీపీ తన వంతు పాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తాము తొలి నుంచీ రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీతో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విరోధం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆయనతో పోరాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

Related posts