telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉద్యోగం కావాలంటే పరాయి రాష్ట్రానికి వెళ్లాల్సిందేనా?: చంద్రబాబు

chandrababu fire on AP CS again

ఏపీ రాజధాని అమరావతి పై కొనసాగుతున్న అనిచ్చితి పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉద్యోగం కావాలంటే పరాయిరాష్ట్రానికి వెళ్లాల్సిందేనా? అనే భావన యువతలో ఉందని పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని తెలిపారు. రాజధాని చుట్టూ ముసురుకున్న పరిణామాలతో ప్రజలు సైతం కలత చెందుతున్నారని చెప్పారు.

మనకంటూ ఓ నగరం లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఎలా అనే ఆందోళన వారిలో కలుగుతోందని అన్నారు. యువత కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ పైనా విమర్శలు సంధించారు. జగన్ వైఖరి పట్ల రాష్ట్రంలో ఎవరూ సంతృప్తికరంగా లేరని వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనే జగన్ పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోందని అన్నారు.

Related posts