ప్రధాని మోడీ రేపు (ఆదివారం) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు నిరసన దినం పాటించాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ ద్రోహానికి నిరసనగా ర్యాలీలు నిర్వహించాలని అన్నారు.
పుండు మీద కారం జల్లడానికే మోడీ ఏపీకి వస్తున్నారని విమర్శించారు. మోడీ ద్రోహంపై జగన్ ఒక్కమాట అనడని, బీజేపీ, వైసీపీ కుమ్మక్కుకు అదే రుజువని వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత జగన్ శానససభకు రాలేదని, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ నాలుగు సమావేశాలకు హాజరు కాలేదని, వారు ప్రజాసేవకు అనర్హులని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మాదిరిగా ఏపీలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.