కర్నూలు జిల్లాలో సీఎం జగన్పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం నాడు ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో బాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాము కన్నెర్ర చేస్తే సీఎం వైఎస్ జగన్ తట్టుకోలేరని ఒకింత హెచ్చరించారు. తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని టీడీపీ రా చంద్రబాబు కర్నూలు వేదికగా వ్యాఖ్యానించారు.
తాను కన్నెర్రే చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. జగన్ పాలనలో ప్రజలకు వేధింపులు , అప్పులు, బాదుడే బాదుడు అని వ్యాఖ్యానించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తెలుగుజాతి ఉన్నంతవరకూ టీడీపీ ఉంటుంది. ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. టీడీపీని దెబ్బతీయాలని కొందరు ఎన్నో కుట్రలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించాలి. ఒంగోలు మహానాడు ద్వారా చర్చించుకుందాం. పైశాచిక ఆనందంతో జగన్ పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా..?. తప్పుడు కేసులకు మా కార్యకర్తలు భయపడరు. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోంది. నా జీవితంలో ఇంత విధ్వంస పాలన ఎప్పుడూ చూడలేదు. ఇదేంటి అని ప్రశ్నిస్తే వారిపైనే దాడులు చేస్తున్నారు.
దేశ చరిత్రలో రాజధాని మార్పు ఎక్కడా జరగలేదు: చంద్రబాబు