తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్ష చేస్తున్న కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్టు చేసి నిమ్స్ లో చేర్చిన విషయం తెలిసిందే. చికిత్సకు నిరాకరిస్తూ కూనంనేని ఆస్పత్రిలో కూడా తన దీక్ష కొనసాగిస్తున్నారు.
ఈ రోజు చాడ వెంకటరెడ్డి కూనంనేనిని ఆసుపత్రిలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని అన్నారు.కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదని ఆయన చెప్పారు. కేసీఆర్ తలచుకుంటే సమస్యకు గంటలో పరిష్కారం లభిస్తుందన్నారు. కూనంనేనిని పరామర్శించిన ఇతర నేతల్లో ప్రొఫెసర్ కోదండరాం, వీహెచ్, ఎల్.రమణ, రావుల తదితరులున్నారు.
పోతిరెడ్డిపాడును జగన్కు కేసీఆర్ గిఫ్ట్గా ఇచ్చారు: రేవంత్రెడ్డి