ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది. అయితే అది ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. అయితే రాగానే అందరికి వేసే వీళ్లేదు.. దాంతో దేశ ప్రజలందరిని వివిధ విభాగాలుగా విభజించి.. ప్రాదాన్యతా క్రమంలో వాక్సిన్ వేయనున్నారు.. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి.. కరోనా వాక్సిన్ పంపినీ కోసం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ^విధివిదానాలను ప్రకటించింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక వాటిని ఎలా ప్రజలకు ఇవ్వాలనే దానిపై దిశా^నిర్దేశం చేసింది.. అంతేకాదు టీకా త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న ఉద్దేశంతో కేంద్రం సన్నద్దం అవుతూనే రాష్ట్రాలను రెఢీ చేస్తోంది. దేశ జనాభాకు మొత్తం వాక్సిన్ ఒకే సారి ఇవ్వటం కుదరని పని.. అంతేకాదు ప్రొడక్షన్ కూడా ఒకే సారి ఉండదు.. వ్యాక్సిన్లు ఏయే రోజుల్లో వేయాలన్న దానిపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చు. ముందుగా హెల్త్ వర్కర్లు.. ఫ్రంట్లైన్ సిబ్బందికి టీకా వేస్తారు. ఆ తర్వాత జనాభాలో ముప్పు అధికంగా ఉన్న వయసుల వారికి , ఇతర ఇబ్బంధులు ఉన్న వారికి వాక్సిన్ ఇస్తారు. దేశ ప్రజలకు కరోనా టీకా పంపిణీ చేసేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. కరోనా ప్రభావానికి ఎక్కువగా గురయ్యే వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూనే మిగతా వారిని సమయానుకూలంగా జాబితాలో చేర్చాలని భావిస్తోంది. చూడాలి మరి అది ఎప్పుడు వస్తుంది అనేది.
previous post