సామాన్య వాహనదారులకు తీపికబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రో ధరలపై భారీ ఊరట ఇచ్చే ప్రకటన చేసింది. ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు శనివారం సాయంత్రం వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ 8 రూపాయలు, డీజిల్ పై రూ. లీటర్ డీజిల్పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు.
తద్వారా పెట్రోల్ పై లీటర్కు రూ. 9.5, డీజిల్పై రూ.7 తగ్గుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు