telugu navyamedia
వ్యాపార వార్తలు

సామాన్య‌ల‌కు శుభవార్త.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

సామాన్య‌ వాహనదారులకు తీపికబురు అందించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రో ధరలపై భారీ ఊరట ఇచ్చే ప్రకటన చేసింది. ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు శనివారం సాయంత్రం వెల్లడించింది.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ 8 రూపాయలు, డీజిల్‌ పై రూ. లీటర్ డీజిల్‌పై 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆమె తెలిపారు.

తద్వారా పెట్రోల్‌ పై లీటర్‌కు రూ. 9.5, డీజిల్‌పై రూ.7 తగ్గుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు

Related posts