వరల్డ్ కప్ 2019లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియన్ టీమ్ అమోఘ విజయం సాధించింది. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ మొదలు కొని తైమార్ (సైఫ్ అలీ, కరీనా కుమారుడు) వరకూ అందరూ భారత క్రికెట్ టీమ్కు అభినందనలు తెలియజేశారు. సల్మాన్ ట్విట్టర్లో ఒక ఫొటోను షేర్ చేశారు. దానిలో ఇండియా అని రాసివున్న టీ షర్టు ధరించి కనిపిస్తున్నారు. అలాగే ‘భారత టీమ్కు అభినందనలు’ అని రాశారు. తైమూర్కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిలో తైమూర్ ఇండియా అని రాసివున్న టీ షర్టు ధరించి, భారత్కు సెల్యూట్ చేస్తూ కనిపిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ మాంచెస్టర్లో జరిగిన భారత్- పాక్ మ్యాచ్ను తిలకించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ‘జవానీ జానేమన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న అలియా కూడా మ్యాచ్ తిలకించారు. హీరో రణవీర్ మైదానంలో సందడి చేస్తూ, ఇండియన్ టీమ్లో ఉత్సాహాన్ని నింపారు. బాలీవుడ్ ప్రముఖులు అర్జున్ రామ్పాల్, సన్నీలియోన్, రితేష్ దేశ్ముఖ్, స్వరా భాస్కర్ తదితరులు టీమ్ ఇండియా విజయం సాధించిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.