ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈరోజు సీబీఐ అధికారులు వెళ్లారు.
ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశారు.
ఈ అంశంపై కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ “ఈరోజు మధ్యాహ్నం సీబీఐ అధికారులు నాకు నోటీసులు అందజేశారు. దీనిపై నా లీగల్ టీమ్తో చర్చిస్తున్నాను. చట్టంపై నాకు నమ్మకం ఉంది. విచారణకు సంపూర్ణంగా సహకరిస్తాను” అని పేర్కొన్నారు.

