ఆంధ్ర ప్రదేశ్ లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘురామకృష్ణంరాజు ఇంటిపై ఈ ఉదయం నుంచి సీబీఐ దాడులు జరుగుతున్నాయి. గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో రఘురామకృష్ణంరాజు కంపెనీలు విఫలం అయ్యాయి.
బ్యాంక్ లకు రుణాల ఎగవేతపై గతంలోనే కేసు నమోదు చేసిన సీబీఐ విచారణలో భాగంగా, ఎమ్మార్ లో ఉన్న ఆయన నివాసంపై దాడి చేసింది. బెంగళూరు నుంచి వచ్చిన పలువురు అధికారులు ప్రస్తుతం ఆయన ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. సీబీఐ దాడులపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
కాంగ్రెస్కు ఓటేస్తే టీఆర్ఎస్కు వెళ్లే పరిస్థితులు: కిషన్ రెడ్డి