రాజన్న జిల్లాలోని సిరిసిల్లలో యువతిని లైంగికంగా వేధించిన కానిస్టేబుల్పై కేసు నమోదైంది. స్టేషన్కు వచ్చిన యువతిని కానిస్టేబుల్ లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మేరకు కానిస్టేబుల్ సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
మరో ఘటనలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం జలాల్పూర్లో బాలికను వేధిస్తున్న యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. యువకుడు తనను ప్రేమించాలంటూ కొంతకాలంగా బాలికను వేధిస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.