సినీ నటి రాధ ప్రశాంతిపై హైదరాబాద బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. రాధా ప్రశాంతి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ సెక్యూరిటీగా పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను రాధ ప్రశాంతి కారు ఢీ కొట్టింది. అయితే ఆ సమయలో అక్కడకు చేరుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దాడి దృశ్యాల్ని తన మొబైల్లో చిత్రీకరించారు. దీంతో సాప్ట్వేర్ ఇంజనీర్ మొబైల్ లాక్కొని ధ్వంసం చేశారు సినీ నటి రాధ ప్రశాంతి. తనతో అసభ్యకరంగా కూడా ప్రవర్తించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. రాధ ప్రశాంతితో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.