telugu navyamedia
Uncategorized

టీడీపీ కౌన్సిలర్ పై లైంగిక వేధింపుల కేసు

Parents Murdered Daughter at Mancherial

ఏపీలోని విజయవాడ ప్రాంతంలోని సత్తెనపల్లిలో 4 వ వార్డు టీడీపీ కౌన్సిలర్ బి.మనోహర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మనోహర్ నుండి ఓ మహిళ మూడు లక్షలు తీసుకొంది. ఇందులో రూ.1.50 లక్షలు తిరిగి ఇచ్చింది. మిగిలిన డబ్బుల కోసం కూడ కౌన్సిలర్ ఆమె పై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఈ డబ్బులు చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని ఆమె కోరింది. కానీ అతను ఒప్పుకోలేదు.

మిగితా డబ్బులు చెల్లించడానికి మరింత సమయం ఇవ్వడానికి తన కోర్కె తీర్చాలని వేధింపులకు గురి చేసినట్టుగా బాధితురాలు ఆరోపించింది. తమ ఇంట్లోకి వచ్చి తన కోర్కె తీర్చాలని కౌన్సిలర్ వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు వీడియో క్లిప్పులను అందజేసి ఫిర్యాదు చేసింది. బాధితురాలిమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts