లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రోడ్లన్నీ రోడ్లన్నీ కర్ఫ్యూను తెలపిస్తున్నాయి. మరో వైపు భర్తకు ప్రభుత్వం సమకూర్చిన కారు ఖాళీగానే ఉంది. ఇక సర్కారు కారులో హాయిగా డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఓ మహిళ బయుదేరింది. దీన్ని వీడియోతీసి ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు మహిళ భర్తపై కలెక్టర్ బదిలీ వేటు వేశారు.
వివరాల్లోకి వెళితే…మధ్యప్రదేశ్ రాష్ట్రం రైసన్ జిల్లా సిల్వానీ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ భార్య భర్తకు ప్రభుత్వం సమకూర్చిన కారులో ఇటీవ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. దీన్ని గమనించిన ఓ యువకుడు ఆమెను ప్రశ్నించాడు. విషయం తెలుసుకుని వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఈ వీడియో కాస్త వైరల్గా మారడంతో విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో సదరు సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్పై కలెక్టర్ బదిలీ వేటు వేశారు.
తిరుమల తిరుపతి ఆంధ్రుల ఆస్తి: చంద్రబాబు