telugu navyamedia
క్రైమ్ వార్తలు

సికింద్రాబాద్​లోని పరేడ్‌ మైదానం ఫ్లైఓవర్‌పై కారు దగ్ధం ..

సికింద్రాబాద్​లో పరేడ్‌ మైదానం ఫ్లైఓవర్‌పై కారు దగ్ధమైంది. కారులో అకస్మాత్తుగా మంటలు చేల రేగ‌డంతో అప్రమత్తమైన‌ డ్రైవ‌ర్ కారు నుంచి దిగిపోయారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని సికింద్రాబాద్​లో పరేడ్‌ మైదానం ఫ్లైఓవర్‌పై జ‌రిగింది. దీంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

కారు దగ్ధం కావ‌డం చూసిన‌ వాహనదారులు భయాందోళనకు గురైయ్యారు. జామ్‌ వల్ల ఘటనాస్థాలానికి ఫైరింజన్ చేరుకోలేకపోవ‌డంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఉన్నట్టుండి వాహనంలో మంటలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంటనే స్పందించిన పోలీసులు ప్లైఓవర్‌పై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. క్రేన్‌ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు.

Related posts