telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సముద్ర గర్భంలో సీఎం జ‌గ‌న్‌కు బ‌ర్త్‌డే విసెష్‌..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఊహించని రీతితో బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. సముద్రపు అంచుల్లోకి వెళ్లి అంచుల్లోకి వెళ్లి సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని చూరగొని.. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఏకంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి.. తన తమ్ముడి లాంటివాడు అని చెప్పిన సీఎం జగన్.. అతడిని బాగా చూసుకుంటానని చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో బైరెడ్డికి శాప్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.

Jagan gives Byreddy Siddharth Reddy an important post - TeluguBulletin.com

జ‌గ‌న్ పై త‌నకున్న‌ అభిమాన్ని అడ్వంచర్‌ డైరెక్టర్‌ బలరామ్‌నాయుడుతో కలసి సముద్రంలో 30 అడుగుల లోతు వరకు స్కూబా డైవ్‌ చేశారు. జగన్‌ పుట్టినరోజు సందర్భంగా సముద్ర గర్భంలోకి వెళ్లి త‌న చేత్తో స్వ‌యంగా రాసి అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే సీఎం సార్‌ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

కాగా…డిసెంబర్ 21న ఏపీ సీఎం జగన్ బర్త్ డే. దీంతో వైసీపీ నాయకులు, శ్రేణులు ముఖ్యమంత్రి జగన్‌ బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వస్తున్నారు.

Related posts