ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్నగర్-సహరాన్పూర్ రహదారిపై గలౌలి చెక్పోస్టు వద్ద గడిచిన రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బస్సు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు.
సుదీర్ఘ నడకతో తమ గమ్యం చేరకముందే మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలస కూలీలు అసువులు బాశారు . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి : ఉమ్మారెడ్డి