telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కర్ణాటకలో కదిరి విద్యార్థుల బస్సు బోల్తా

Accident

అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లాలో బోల్తా పడింది. జోగ్ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందగా… ఇద్దరు ఉపాధ్యాయులు, ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు అద్దాలను పగులగొట్టి విద్యార్థులు బయటకు వచ్చారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వచ్చి, క్షతగాత్రులను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతూ బాబా మక్సుద్దీన్ అనే విద్యార్థి మృతి చెందాడు. బస్సు ప్రమాదం నేపథ్యంలో హెడ్మాస్టర్ కు గుండెపోటు వచ్చింది. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవఆందోళనకు గురవుతున్నారు.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలను అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు. విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావడానికి ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

Related posts