థాయిలాండ్ లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సును రైలు ఢీ కొట్టంది. దీంతో అక్కడిక్కడే 20 మంది మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం సరిగ్గా ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో జరిగింది. బ్యాంకాక్ నుంచి చోంగ్ సావో ప్రావిన్స్లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని ప్రావిన్స్ గవర్నర్ మైత్రీ త్రితిలానంద్ పేర్కొన్నారు.
ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఓ ఫ్యాక్టరీకి చెందిన కార్మికులుగా గుర్తించారు స్థానిక అధికారులు. టూరిస్టు బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా సరుకు రవాణా రైలు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అధికారులు వెల్లడించారు. వర్షం పడుతుండటంతో రైలు వస్తున్నటు బస్సు డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ఈ ఘెర ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జు నుజ్జుయింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం స్థలం బాధితుల ఏడుపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అనేది రాజ్యాంగ విరుద్దం: సుజనా చౌదరి