ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ మాన్సూన్ ఆఫర్లో భాగంగా 899 ఆఫర్కు డిస్కౌంట్తో రూ.786కే అందిస్తుంది. ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు ఈనెల 10 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుంది.
రూ.899 ఆఫర్కు వచ్చే బెనిఫిట్స్ మొత్తం రూ.786 రీచార్జితో వర్తిస్తుంది. ఈ ఆఫర్తో 180 రోజుల వ్యవధితో రోజుకు 1.5జీబీ డేటాతో పాటు 50 ఎస్ఎంఎస్లను వినియోగించుకోవచ్చు. రూ.786తో రెండుసార్లు రీచార్జి చేసుకుంటే.. ఈ ఆఫర్ 360 రోజుల పాటు వర్తిస్తుంది.