ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో ఐపీఎల్ 2020 లో ఆదరగొట్టిన ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, రాహుల్ తెవాటియాలకు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. అయితే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో బీసీసీఐ నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో వీరిద్దరూ విఫలమయ్యారు. రెండు సార్లు అవకాశమిచ్చినా అర్హత సాధించలేకపోయారు. దాంతో భారత్ తరఫున ఆడే అవకాశాని చేజార్చుకున్నారు. అయితే ఈ విషయం పై మాట్లాడిన ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ బ్రాడ్ హాగ్… వీరికి ఇదే చివరి అవకాశం కావచ్చని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆడడానికి కావాల్సిన శక్తిసామర్థ్యాలు సాధించడంలో రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తి విఫలమయ్యారు. వారికి ఆట పట్ల అంకితభావం లేదు. ఎందుకంటే టీమిండియా నిర్దేశించిన ఫిట్నెస్ టెస్ట్లో వాళ్లు విఫలమయ్యారు. ఇదే వారికి చివరి అవకాశం కావొచ్చు అని బ్రాడ్ పేర్కొన్నాడు.
previous post
కేసీఆర్ ఎవరిని కలవడానికి ఢిల్లీకి వస్తున్నారు: బీజేపీ ఎంపీ సంజయ్