బీపీసీఎల్ పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తారని భరత్ తెలిపారు.
కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ ఫాస్ట్ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు.
ఏపీలో పెట్టుబడులకు అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ కూడా ఆసక్తి కనబరిచారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ ఎంఎస్ఎంఈ, క్లస్టర్ విధానాలు అమలు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్ వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, ఓర్వకల్లు, కొప్పర్తిలో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని వివరించారు.
కొత్తగా కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాజధాని అమరావతి సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి టీజీ భరత్ తెలిపారు.