ఓ అమ్మాయిని ర్యాగింగ్ చేశారని ఆమె సన్నిహితులు బాయ్స్ హాస్టల్లోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. హాస్టల్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్గాంలో నిన్న చోటు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పోస్టు మెట్రిక్ హాస్టల్లో ఉంటున్న ఇద్దరు విద్యార్థులు కలిసి.. ఓ అమ్మాయిని ర్యాగింగ్ చేశారు.
దీంతో బాధిత అమ్మాయి తనకు జరిగిన అవమానాన్ని సన్నిహితులకు తెలిపింది. దీంతో సుమారు 20 మంది అబ్బాయిలు ఇనుపరాడ్లు, కర్రలు, బ్యాట్లతో హాస్టల్లోకి ప్రవేశించారు. హాస్టల్ ఫర్నిచర్తో పాటు అక్కడున్న బైక్లు, స్కూటర్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అవసరమైతే రోడ్డుపై పడుకుంటాను.. బెదిరింపులకు భయపడను: చంద్రబాబు