telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కాసేపట్లో అంత్యక్రియలు..అమ్మ పిలుపుకు..?

అమ్మ ప్రేమ . మాటలతో వర్ణించలేదనిది . అటువంటి తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఘటన జరిగింది హర్యానా రాష్ట్రంలో . కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించాల్సిన ఆరేళ్ల కొడుకు తల్లి పిలుపుకు కళ్లు తెరిచిన ఘటన బహదూర్ గఢ్ ప్రాంతంలో సంచలనం కలిగించింది . అమ్మ పిలిస్తే యముడ్ని కూడా ఎదిరించి వచ్చేసాడా అనిపించిందీ ఘటన . చనిపోయిన కొడుకుని తలుచుకుని ఆ కొడుకు ముద్దు మాటలు … అల్లరి పనులు తలచుకుని తలచుకుని ఏడుస్తున్న తల్లికి కళ్లు తెరిచిన కొడుకుని చూసుకుని పడిన ఆనందం అంతా ఇంతా కాదు . లోకాన్నే జయించినంతగా సంబరపడిపోయింది కొడుకు ముఖాన్ని వాత్సల్యపు ముద్దులతో నింపేసింది . హర్యానాలో జరిగిన ఈ అద్భుత ఘటన గురించి ఒక్క పిలుపుతో ఆ ఆరేళ్ల పిల్లాడు లేచి కూర్చోవడం ఆ ఊరి వారంతా ఆ తల్లి ప్రేమను కథలు కథలుగా చెప్పుకుంటున్నారు .

హర్యానాలోని బహదూర్ గఢ్ ప్రాంతానికి చెందిన హితేష్ , ఝాన్వి భార్యాభర్తలు . వారికి ఆరు ఏళ్ల కొడుకు ఉన్నాడు . ఆ పిల్లాడికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది . చికిత్స అందించినా తగ్గలేదు . దీంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నా ఫలితం దక్కలేదు . మే 26 న చనిపోయాడని డాక్టర్లు చెప్పటంతో ఝాన్వి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది . ” పట్టుమని పదేళ్లు కూడా నిండని నీకు నిండు నూరేండ్లు అప్పుడే నిండిపోయాయా కన్నా ‘ అంటూ గుండెలు అవిసేలా ఏడ్చింది . ఏక ధారగా ఏడుస్తూనే ఉంది . ‘ ఎంత ఏడ్చినా పోయిన నీ కొడుకు తిరిగొస్తాడామ్మా..దేవుడికి దయలేదమ్మా .. ఊరుకోమ్మా ‘ అంటూ బంధువులు..ఇరుగు పొరుగువారు ఓదార్చినా ఆ తల్లి వేదన తీరలేదు . ” లేనా కన్నా..లే అమ్మా అని ఒక్కసారి పిలవరా బాబూ ‘ అని తల్లడిల్లిపోతూ ఏడుస్తూనే ఉంది . ఎంత ఏడ్చినా జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి కదా..అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు . రాత్రంతా శవం వద్ద జాగారణ చేస్తూ తల్లిదండ్రులు ఏడుస్తూనే ఉన్నారు . ‘ లేచి కూర్చోరా నాన్నా ‘ అంటూ ఆ పిచ్చితల్లి అమాయకంగా పిల్లాడ్ని మృతదేహాన్ని అటూ ఇటూ కదుపుతూ ఏడుస్తూనే ఉంది . మరి ఏదేవుడు ఆ తల్లి మొర విన్నాడో గానీ … ‘ పిల్లాడి శరీరంలో కదలిక కనిపించాయి..అంతే ఒక్కసారి ఆశ్చర్యపోయిన తండ్రి వెంటనే తేరుకుని పిల్లాడి శరీరాన్ని ప్యాకింగ్ నుంచి వేరు చేసి నోటి ద్వారా శ్వాస అందించాడు .

అచ్చు సినిమాల్లోలాగా ఆ పిల్లాడి గుండెల మీద గట్టిగా ఒత్తడంతో ఒక్కసారి పిల్లాడి గుండె కొట్టుకోవడం ప్రారంభమైంది . అంతే ఆ తల్లిదండ్రుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు.వెంటనే చికిత్స కోసం పిల్లాడ్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా రోహతక్ ఆసుపత్రికి తరలించారు . జరిగింది చెప్పగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ల ఆక్సిజన్ పెట్టి చికిత్స ప్రారంభించాడు . ఇప్పుడు ఆ పిల్లాడు చక్కగా కోలుకోవటంతో మంగళవారం ( జూన్ 15,2021 ) డిశ్చార్జ్ చేయగా ఇంటికి తీసుకొచ్చారు . చనిపోయాడనుకున్న కొడుకు బతికిరావటంతో తల్లిదండ్రులకు సాక్షాత్తూ ఆ భగవంతుడే తమ మొర ఆకలించాడని మురిసిపోతున్నారు . నా కొడుకు మృత్యుంజయుడు అని మురిసిపోతున్నారు . గ్రామస్థులు ఆశ్చర్యానికి అంతు లేదు . ఆ తల్లిదండ్రుల మొర దేవుడు ఆలకించాడు..చచ్చిపోయిన కొడుకుని తిరిగి ఇచ్చాడంటూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు . ” అమ్మ ప్రేమ ” కొడుకుని బతికించిందని చెప్పుకుంటున్నారు .

Related posts