telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

విశాఖపట్నం : .. అపహరణకు గురైన బాలుడి కథ .. సుకాంతం..

boy kidnapped issue comes to end safely return

స్థానిక తూర్పుగోదావరి జిల్లాలోని రామవరం మండలం కుతుకులూరు వద్ద కిడ్నాప్‌కు గురైన బాలుడు జిషిత్ ఆచూకి లభ్యమైంది. గుర్తు తెలియని అగంతకులు బాలుడిని గ్రామంలో వదిలి వెళ్లారు. బాలుడు క్షేమంగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ నయీం అస్మి నిర్ధారించారు. తెల్లవారుజామున బాలుడిని వదిలి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

మండపేట విజయలక్ష్మినగర్‌లో సోమవారం రాత్రి ఇంటివద్దే దుండగులు బాలుడిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. బాలుడి నాయనమ్మ పార్వతిపై దాడి చేసి జిషిత్‌ను ఎత్తుకెళ్లారు. ఈ కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. బాలుడు తిరిగి రావటంతో, వారి తల్లిదండ్రులతో సహా ఈ విషయం తెలిసిన ప్రతి మనసు సంతోషం వ్యక్తం చేస్తుంది.

Related posts