ప్రొ బాక్సింగ్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఓటమి ఎరుగని ధీరుడు విజేందర్ సింగ్. తాజాగా 11వ బౌట్ గెలిచి జోరుమీదున్నాడు. అదే ఊపులో సహచర ప్రొ బాక్సర్ నీరజ్ గోయత్ను ‘పిల్లాడు’ అనేశాడు. మనసు నొచ్చుకున్న నీరజ్ తాను పిల్లాడిని కాదు పిడుగును అంటున్నాడు. పోరుకు సిద్ధమా అని సవాల్ చేస్తున్నాడు. బ్రిటిష్ బాక్సర్ ఆమిర్ ఖాన్తో డబ్ల్యూబీసీ పెర్ల్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఓ నెల క్రితమే నీరజ్ తలపడాల్సి ఉంది. అతడికి కారు ప్రమాదం జరగడంతో వాయిదా పడింది. ఇంతలోనే 11వ బౌట్ గెలిచిన విజేందర్ ఒకప్పుడు ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన ఆమిర్ను సవాల్ చేశాడు. పిల్లలతో కాదు తనతో తలపడాలని సూచించాడు.
ఆ మాటలు నీరజ్ను గాయపరిచాయి. బాక్సర్ విజేందర్ నన్ను పిల్లాడని అన్నాడు. ఒక ప్రపంచ విజేతను తన సొంత దేశంలో ఓడించిన ఒకే ఒక్క భారత బాక్సర్ నేను. ఈ నవంబర్లో నాతో, బాక్సర్ వికాస్ కృష్ణన్, ఆమిర్తో తలపడాలని సవాల్ చేస్తున్నా. మీరు సిద్ధమా? అని నీరజ్ ట్వీట్ చేశాడు. ‘విజేందర్, నీరజ్, ఆమిర్ ఒకే విభాగంలో ఉన్నారు కాబట్టి పోటీపడొచ్చు. నీరజ్ అన్నట్టు మనమంతా నవంబర్లో బరిలోకి దిగొచ్చు… రింగులోనే తేల్చుకుందాం పదండి.. అని వికాస్ అతడికి మద్దతుగా ట్వీటు పెట్టాడు.