telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరి కొన్ని కొత్త పేర్లు..?

బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1 గా ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉన్న సంగతి తెలిసిందే.  అఖిలప్రియను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  హాఫిజ్ పేట భూముల విషయంలో కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ3 గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను చేర్చారు.  అయితే, భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నాడో పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు.  నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, ఈ కిడ్నాప్ కేసులో అనేకమంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఇక బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్, భార్గవ్ అమ్మ నాన్న, భార్గవ్ తమ్ముడు చంద్రహాస్ పేర్లను కూడా చేర్చినట్టు చెబుతున్నారు. ఈ బోయినపల్లి కిడ్నాప్  కేసు ఎఫ్ ఐ అర్లో భార్గవ్ ఫ్యామిలీ మొత్తాన్ని పోలీసులు చేర్చినట్టు చెబుతున్నారు. కిడ్నాప్ ప్లాన్ నుండి నిందితులు పారిపోయే వరకు భార్గవ్ ఫ్యామిలీ సాయం చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ కేసు ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Related posts