telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

రాష్ట్రానికి ఇక స్వర్ణయుగమే: బొత్స

ycp letter to CS on praja vedika building
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణయుగం రానున్నదని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ అన్నారు.  ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ  తనకిప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిన నేత వైఎస్ జగన్ లో కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ నేతా తీసుకోనటువంటి నిర్ణయాలను జగన్ తీసుకుంటున్నారని అన్నారు. ఎందరో  ముఖ్యమంత్రులు మాటలు చెప్పారని, చేతల్లో చేసి చూపుతున్న సీఎం మాత్రం జగనేనని కొనియాడారు.  50 శాతం పదవులు బడుగు, బలహీనవర్గాలకు ఇస్తూ  సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలకూ న్యాయం చేయాలన్నదే  జగన్ తపన అని బొత్స వ్యాఖ్యానించారు.

Related posts