సినీ లోకానికి అతిలోక సుందరి .. శ్రీదేవి బాత్ టబ్లో పడి ఫిబ్రవరి 24, 2018న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై ఇప్పటికి పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. రీసెంట్గా కేరళకి చెందిన జైళ్ళ శాఖ డీజీపీ రిషి రాజ్ సింగ్.. శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని వ్యాఖ్యానించారు. తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ శ్రీదేవి మరణం గురించి నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.
శ్రీదేవి హత్య చేయబడిందని నా ఫ్రెండ్ నాతో చెప్పడంతో దానిపై ఆరా తీసాను. కొన్ని కీలక ఆధారాలని బట్టి చూస్తుంటే ఆమెది యాక్సిడెంటల్ డెత్ కానే కాదు. కావాలనే ఎవరో మర్డర్ చేసారని క్లియర్గా అర్ధమవుతుందని డీజీపీ రిషి రాజ్సింగ్ పేర్కొన్నారు. ఈ విషయాలు బోనికపూర్ చెంతకి చేరడంతో ఆయన దీనిపై ఘాటుగా స్పందించారు. ఇలాంటి చెత్త స్టోరీలు నేను పట్టించుకోను.
ఆధారాలు లేని ఊహాజనిత స్టోరీలకి స్పందించాల్సిన అవసరం లేదని బోని ఒకింత అసహనం వ్యక్తం చేశారు.. వాటిని నేను అస్సలు పట్టించుకోను. కొందరు మూర్ఖులు ఇలాంటివి పుట్టిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. బోని కపూర్ ప్రస్తుతం అజిత్ హీరోగా పింక్ రీమేక్ చేస్తున్నారు. నెర్కొండ పార్వాయి అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఖాకీ ఫేం హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్లు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో… సుశాంత్ కేసుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు