తిరుమల శ్రీవారి దర్శనానికి అన్యమతస్థులకు డిక్లరేషన్ ఎందుకని ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపిన సంగతి తెలిసిందే. ఎక్కడా లేని రూల్స్ తిరుమలలోనే ఎందుకున్నాయని మంత్రి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కొడాలి నానివ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చట్టాల గురించి తెలుసుకోవాలని చెప్పారు.
వెంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకుంటే పతనమైపోతారని హెచ్చరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని దేవస్థానమే తిరుమల అని, ఈ విషయాన్ని ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. 16 నెలల వైసీపీ పాలనలో అవినీతి, దోపిడీ తప్ప మరేమీ లేదని ఉమ ఆరోపించారు. అమరావతిలో భూములు కొనకూడదని ఏదైనా చట్టం ఉందా? అని ప్రశ్నించారు.